సన్నీ డియోల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘గదర్-2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్నది. 2001లో వచ్చిన యుద్ధ నేపథ్య ప్రేమకథ ‘గదర్’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా ఈ చిత్రం హిందీలో ‘కేజీఎఫ్-2’ వసూళ్లను (435 కోట్లు) అధిగమించింది. కేవలం 16రోజుల్లోనే ‘గదర్-2’ ఈ ఫీట్ను సాధించడం విశేషం.
ఈ రికార్డుతో హిందీలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. దక్షిణాది బెల్ట్లోని బీ, సీ సెంటర్లలో ఈ సినిమాకు అద్భుత ఆదరణ దక్కుతున్నదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. లాంగ్న్ల్రో ఈ చిత్రం హిందీ మార్కెట్లో 500కోట్ల వసూళ్ల మైలురాయిని అందుకోవడం సాధ్యమేనేని అంచనా వేస్తున్నారు.