మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్కుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హ్యాపీ రాజ్’. మరియా రాజా ఎలాంచెజియన్ దర్శకుడు. గౌరీప్రియ కథానాయికగా నటిస్తున్నది. ఈ నెల 27న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ ద్వారా తెలుగు రాష్ర్టాల్లో విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఈ సినిమా నుంచి ‘అద్దిరా లెక్క’ అనే పాటను విడుదల చేశారు. జస్జిన్ ప్రభాకరన్ స్వరపరచిన ఈ పాటను రెహమాన్ రచించారు. ఈ పాటలో జీవీ ప్రకాష్కుమార్, గౌరీప్రియ మధ్య కెమిస్ట్రీ హైలైట్గా నిలిచింది. ఫీల్గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని, నేటి యువత మెచ్చే అన్ని అంశాలుంటాయని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత: జైవర్ధ, దర్శకత్వం: మరియా రాజా ఎలాంచెజియన్.