Mirnalini Ravi | సోషల్ మీడియా డబ్స్మాష్ వీడియోల నుంచి వెండితెర హీరోయిన్గా ఎదిగిన నటి మృణాళిని రవి (Mirnalini Ravi) తాజాగా ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా మృణాళిని కొన్న కారు మోడల్ ‘లిమిటెడ్ ఎడిషన్’ కావడంతో ఇది మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా BE6 ఎలక్ట్రిక్ SUV పేరిటా ఒక లగ్జరీ కారును విడుదల చేసిన విషయం తెలిసిందే. మహీంద్రా BE6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ అంటూ ఈ మోడల్ మార్కెట్లోకి రాగా.. ఈ మోడల్ను మహీంద్రా కంపెనీ ‘ఫ్రీడమ్ NU’ పేరుతో నిర్వహించిన ఒక ఈవెంట్లో విడుదల చేసింది. ఈ బ్యాట్మ్యాన్ ఎడిషన్ కారు అమ్మకాలు కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఈ ప్రత్యేక కారును దక్కించుకున్న మొదటి దక్షిణాది సినీ నటిగా మృణాళిని రవి రికార్డు సృష్టించింది. సరికొత్త టెక్నాలజీ, లేటెస్ట్ డిజైన్తో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ SUV ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 28 లక్షల వరకు ఉంది. ఈ కారు కేవలం 6.7 సెకన్లలో 0-100 kph వేగాన్ని అందుకోగలదు. బ్యాట్మ్యాన్ ఎడిషన్ కార్లకు స్టార్ క్రికెటర్లు, నటుల నుంచి భారీ డిమాండ్ ఉంది. ఈ కార్లు బుకింగ్స్ ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే అమ్ముడైనట్లు తెలుస్తోంది.
ఇక సోషల్ మీడియాలో డబ్స్మాష్ వీడియోలు, రీల్స్తో పాపులర్ అయిన మృణాళిని రవికి దర్శకుడు త్యాగరాజన్ కుమార్ తొలి అవకాశం ఇచ్చారు. 2019లో వచ్చిన ‘సూపర్ డీలక్స్’ చిత్రంలో చిన్న పాత్ర పోషించినా, వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ఛాన్స్ దక్కించుకోవడంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వరుస తమిళ, తెలుగు సినిమాలతో బిజీగా ఉంటూ తన మార్కెట్ను పెంచుకున్నారు.