అమ్మని అయ్యాక నేను చాలా మారాను అంటున్నది మాజీ ప్రపంచసుందరి ప్రియాంక చోప్రా. ఓ బిడ్డకు జన్మనిచ్చాక తనలో వచ్చిన మార్పు గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది ప్రియాంక. ‘నేను తల్లిని కాబోతున్నానని తెలిసిన క్షణంలో ఏదో తెలియని భయం. బహుశా అందరు ఆడవాళ్లకూ ఆ ఫీలింగ్ ఉంటుందేమో. దానికితోడు లెక్కకు మించిన సందేహాలు. ఖాళీ దొరికితే చాలు హాస్పిటల్కి వెళ్లి డాక్టర్ మెదడు తినేదాన్ని. కూతురు పుట్టింది. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
ఆడదానికి బిడ్డను కనడం పెద్ద టాస్క్. ఎంత టెక్నాలజీ పెరిగినా దానికష్టం దానికుంటుంది. అది స్త్రీలకే తెలుసు. బిడ్డను కన్న తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఏదైనా చేయగలననే ధైర్యం వచ్చింది. బహుశా అమ్మతనంలోనే ఆత్మవిశ్వాసం ఉంటుందేమో. అంతకుముందు శరీరంపై శ్రద్ధ ఉండేదికాదు. ఇప్పుడు తెలీకుండా శ్రద్ధ పెరిగిపోయింది’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. ఇంకా మట్లాడుతూ ‘ తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే నేను నంబర్వన్గా నిలిచాను. నేను కూడా నా కూతుర్ని అలాగే పెంచాలనుకుంటున్నాను’ అన్నారు ప్రియాంక.