ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు ఫోక్ సాంగ్స్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా దాదాపు అన్ని సినిమాలలో కనీసం ఒక ఫోక్ సాంగ్ అయిన ఉంటుంది. ఫోక్ సాంగ్స్తోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
రంగస్థలం సినిమాలోని ఆ గట్టునుంటావా పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శివనాగులు పాడిన ఈ పాటకి మంచి ఆదరణ లభించిన కూడా తర్వాత అతనికి ఆఫర్స్ కరువయ్యాయి. ఇక ఇదే సినిమాలోని జిల్ జిల్ జిగేల్ రాణి అనే పాటను ఘంటా విజయలక్ష్మీ పాడారు. శ్రీకారం సినిమాలోని వచ్చానంటివో పోతానంటివో పాటను పెంచల్ దాస్ పాడగా, గతంలో ఆయన పాడిన పాటలకు కూడా మంచి ఆదరణ దక్కింది.
ఇక భీమ్లా నాయక్ సినిమాలోని టైటిల్ సాంగ్ కిన్నెర మొగలయ్య పాడగా, ఇదే సినిమాలోని అడవి తల్లి పాటను దుర్గవ్వ పాడార. పుష్ప సినిమా విషయానికి వస్తే సామి సామి పాటను మోనికా యాదవ్ పాడగా, రీసెంట్గా విడుదలైన ఊ అంటావా పాటను ఇంద్రవతి చౌహన్ పాడింది. అల వైకుంఠపురంలోని సిత్తరాల సిరపడు పాటను ఉత్తరాంధ్ర గాయకుడు సూరప్ప పాడారు. రాములో రాములో అనే పాటను మంగ్లీ పాడింది. ఈమె సినిమాలలో చాలా పాటలు పాడగా అన్ని హిట్ అయ్యాయి. ఇలా ఫోక్ సింగర్స్ ఇటీవలి కాలంలో సినిమా పాటలతో మెప్పిస్తున్నారు.