టాలీవుడ్ (Tollywood) హీరో నాగశౌర్య (Naga Shourya), రీతూ వర్మ (Ritu Varma) కాంబినేషన్లో వస్తున్న చిత్రం వరుడు కావలెను (Varudu Kavalenu). లక్ష్మీ సౌజన్య (Lakshmi Sowjanya) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్కు మంచి స్పందన వస్తోంది. కాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం జరుగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ప్రముఖ సెలబ్రిటీ రాబోతున్నారు. మరి ఏ స్టార్ హీరో ముఖ్య అతిథిగా రాబోతున్నారని ఆలోచిస్తున్నారా..? ఆగండి.
ఈ సారి వస్తున్న చీఫ్ గెస్ట్ మేల్, ఫీమేల్ సెలబ్రిటీ. అదేనండి స్టార్ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరనే కదా మీ డౌటు. తెలుగు, తమిళ, హిందీ దర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయిన పూజాహెగ్డే (Pooja Hegde). సాధారణంగా స్టార్ హీరోలు వచ్చే ప్రీ రిలీజ్ ఈవెంట్కు పూజాహెగ్డేలాంటి ఓ స్టార్ హీరోయిన్ ముఖ్యఅతిథిగా మొదటిసారి అనే చెప్పాలి.
తెలుగు ప్రేక్షకుల్లో పూజాహెగ్డేకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. పూజాహెగ్డే ప్రస్తుతం విజయ్తో బీస్ట్ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు ప్రభాస్ తో చేస్తున్న రాధేశ్యామ్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Rakul Preet Singh | రకుల్ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Ravi Teja | ఇద్దరు హీరోయిన్లతో దుబాయ్కు రవితేజ..!
Arha: బన్నీ కూతురిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత