హర్ష, విక్రమ్, సింధు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దేవుడితో సహజీవనం’. సాయిరామ్ దాసరి దర్శకత్వం వహిస్తూ వంశీధర్రెడ్డి, సురేష్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫస్ట్లుక్ను ఇటీవల హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘వెండితెరపై ఇప్పటివరకు ఎవరి స్పృశించని కథతో తెరకెక్కించిన చిత్రమిది. భైరవ్ అనే కుక్క నేపథ్యంలో ఈ కథ సాగుతుంది’ అని తెలిపారు. ఇందులో తాను దేవుడి పాత్రలో నటిస్తున్నట్లు, దైవం లీలల కారణంగా కొందరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయన్నది ఆసక్తికరంగా ఉంటుందని విక్రాంత్ చెప్పారు. నవ్విస్తూనే థ్రిల్కు గురిచేసే చిత్రమిదని సురేష్ పేర్కొన్నారు.