Pawan kalyan | ఈ మధ్య పవన్ కొత్త సినిమాలతో తెగ బిజీగా ఉండటంతో హరిహర వీరమల్లును పక్కన పెట్టేశాడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ డ్రామా ఎప్పుడో షూటింగ్ను స్టార్ట్ చేసింది. అయితే పవన్ బిజీ షెడ్యూల్ వల్ల షూటింగ్కు పలు మార్లు బ్రేకులు పడుతూ వస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తిచేసుంది. ఇక తాజాగా ఈ సినిమా మేజర్ షెడ్యూల్కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రేపో మాపో చిత్రీకరణ కూడా స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ లోపే హరిహర వీరమల్లు సినిమాకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఈ సినిమా కోసం వేసిన సెట్లో రాత్రి అగ్నిప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లోని దుండిగల్ పరిసర ప్రాంతలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన కొంత సేపటికే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ సినిమాలోని మేజర్ షెడ్యూల్ కోసం హరిహర వీరమల్లు మేకర్స్ దుండిగల్ ప్రాంతంలో ఓ భారీ సెట్టింగ్ను వేశారు. అయితే ఆ మధ్య కురిసిన భారీ వర్షానికి ఆ సెట్ తీవ్రంగా ధ్వంసమైంది. అలా పాడైన సెట్కు మరమ్మతులు చేస్తున్న టైమ్ లోనే అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
ఏ.ఎమ్ రత్నం సమర్పిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రూపొందుతుంది. ఈ సినిమా టీజర్ రిలీజయ్యే ముందు వరకు హరిహర వీరమల్లుపై పెద్దగా ఎలాంటి అంచనాల్లేవు. పైగా గౌతమీ పుత్ర శాతకర్ణి తప్పితే క్రిష్కు మరో కమర్షియల్ హిట్ లేదు. అంతేకాకుండా ఈ సినిమా ఫస్ట్లుక్ గానీ, టైటిల్ గ్లింప్స్గాని అభిమానులను అంతగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో పవన్ బర్త్డే సందర్భంగా రిలీజైన టీజర్ ఒక్కసారిగా సినిమా అంచనాలను పెంచింది. ఎంతలా అంటే బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు హిందీ హక్కుల కోసం కోట్లు ఆఫర్ చేసేంతలా. అలా ఒక్క టీజర్తో సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి.
పదిహేడవ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. మొఘల్ కాలం నాటి ఓ వజ్రాల దొంగగా పవన్ ఇందులో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో పవన్కు జోడీగా నిధి అగర్వాల్, నర్గీష్ ఫక్రీ నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏ. దయాకర్ రావు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు. ఎమ్. ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.