మురళీకృష్ణంరాజు, శృతిశెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘స్కై’ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది. పృథ్వీ పెరిచర్ల దర్శకుడు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6న సినిమా రావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా వేశామని చిత్రబృందం గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నది.
ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నదని, ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ హార్ట్ టచింగ్ లవ్స్టోరీగా మెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రసూల్ ఎల్లోర్, సంభాషణలు, కథ: పృథ్వీ పెరిచర్ల, మురళీకృష్ణంరాజు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: పృథ్వీ పెరిచెర్ల.