సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా ‘లైక్ షేర్ అండ్ సబ్స్ర్కైబ్’ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు మేర్లపాక గాంధీ. రేపు ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేర్లపాక గాంధీ మాట్లాడుతూ..‘లాక్ డౌన్ సమయంలో యూట్యాబర్ పాత్రల నేపథ్యంతో కథ రాయాలనే ఆలోచన వచ్చింది. ట్రావెల్ వ్లాగర్స్కు ఉండే కష్టాలు, వాళ్లు ఎదుర్కొనే ప్రమాదాలు, సవాళ్లను అంశాలుగా తీసుకుని ఈ కథ సిద్ధం చేశాను. ఇందులో హీరో హీరోయిన్స్ ఇద్దరూ ట్రావెల్ వ్లాగర్స్. వీరి మధ్య జరిగే ఫైట్ ఆసక్తికరంగా ఉంటుంది. ట్రావెల్ వీడియోలు చిత్రీకరించే సన్నివేశాలు థ్రిల్, హిలేరియస్ ఫన్తో సాగుతాయి.
ఒక సమస్యలో ఇరుక్కున్న వీరు దాన్నుంచి ఎలా బయటపడ్డారు అనేది సినిమాలో చూస్తారు. హీరో సంతోష్ శోభన్తో గతంలో ‘ఏక్ మినీ కథ’ చిత్రానికి పనిచేశాను. యూట్యూబర్గా అతను బాగా నటించాడు. ఫరియా అబ్దుల్లా మా కథకు సరైన నాయిక అనిపించింది. ఆమె బయట ఎలా సరదాగా ఉంటుందో ఇందులోనూ అలాంటి పాత్రలోనే కనిపించింది. ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్తో పాటు మరికొన్ని సంస్థలకు సినిమాలు చేసేందుకు కుదుర్చు కున్నాను’ అన్నారు.