అక్కినేని నాగ చైతన్య- సమంత వివాహ బంధానికి ఎట్టకేలకు తెరపడింది. తాము భార్య భర్తలుగా విడిపోతున్నామని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ఇక నుంచి మా సొంత మార్గాల్లో ప్రయాణం చేయడానికి భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా మధ్య ఒక దశాబ్దానికిపైగా స్నేహం ఉండటం మా అదృష్టం. ఇక నుండి స్నేహితులుగా ఉంటామని ప్రకటించారు.
చైతూ- సమంత విడాకుల విషయం చాలా మందిని బాధించింది. ఇకపై వారిని భార్య భర్తలుగా చూడలేమని తెలుసుకున్న అభిమానులు రీల్ లైఫ్లో అయిన చూడాలని ముచ్చటపడుతున్నారు. ‘ఏమాయ చేసావె’లో కార్తీక్, జెస్సీగా సందడి చేసి ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్న ఈ జంట ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’, ‘మజిలీ’ చిత్రాల్లో నటించారు. ఇదే కాకుండా సమంత లీడ్ రోల్లో నటించిన ‘ఓ బేబీ’ సినిమాలో కూడా చైతూ గెస్ట్ రోల్ చేశారు.
ఇప్పుడు ఇద్దరు కలిసి ఓ సినిమా చేయడంని రిక్వెస్ట్లు పెడుతున్నారు. కాగా, ‘మనం’ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. చాలా కాలంపాటు సన్నిహితంగా కొనసాగిన ఈ జోడీ అక్టోబరు 6, 2017న గోవాలో వివాహ బంధంతో ఒక్కటైంది. వరుసగా రెండు రోజులు హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహ వేడుకలు జరిగాయి. ఆ తర్వాత ఇద్దరూ సినీ జీవితాన్ని కొనసాగించారు. ఇక ఇటీవలే నాగచైతన్య ‘లవ్స్టోరి’లో నటించారు. సమంత ‘శాకుంతలం’ చిత్రీకరణని పూర్తి చేసింది.ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది.
ఇది కూడా చూడండి