పుష్పరాజ్ ప్రస్తుతం థియేటర్స్లో సందడి చేస్తున్నాడు. తెలంగాణలో పుష్ప సినిమాకు 5 షోలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలై ట్రైలర్ సినీ ప్రేక్షకులకు కట్టి పడేసింది. సినిమాలోని పాటలకు కూడా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా సమంత నటించిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మామ’ సంచలనం సృష్టించింది. ఈ మాస్ బీట్కు ఫిదా అవుతున్నారు.
ప్రస్తుతం థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపిస్తుంది. అభిమానులు అందరు తెగ హడావిడి చేస్తున్నారు. అయితే అనంతపురం జిల్లా హిందూపురంలో బెనిఫిట్ షో వేస్తామని చెప్పి బాలాజీ థియేటర్ యాజమాన్యం డబ్బులు వసూలు చేసిందని.. అయితే బెనిఫిట్ షో వేయలేదంటూ అభిమానులు ఆందోళనకు దిగారు.
థియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షో వేయకపోవడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. దీంతో పలువురు అభిమానులు థియేటర్పై రాళ్లు రువ్వారు.ఈ విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి అభిమానులను చెదరగొట్టారు. థియేటర్ గేట్లు మూసివేశారు. కాగా ఏపీలో బెనిఫిట్ షో లు వేయవద్దని ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 35ను జారీ చేసిన విషయం తెలిసిందే.