టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పృథ్విరాజ్. ’30 ఇయర్స్ ఇండస్ట్రీ’ డైలాగ్తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. కాగా తాజాగా ఈయనకు విజయవాడ ఫ్యామిలీ కోర్టు షాకిచ్చింది. పృథ్విరాజ్ తన భార్య శ్రీలక్ష్మీకి నెలకు రూ.8 లక్షలు భరణంగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. పృథ్విరాజ్-శ్రీ లక్ష్మీకు 1984లో వివాహాం జరిగింది. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. గత ఐదేళ్ళ నుండి వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు.
ఈ క్రమంలో పృథ్విరాజ్ భార్య శ్రీలక్ష్మీ 2017లో కోర్టును ఆశ్రయిస్తూ.. తన భర్త సినిమాలు, సీరియళ్ళ ద్వారా నెలకు 30లక్షల వరకు సంపాదిస్తున్నాడని అతని నుండి ప్రతి నెల రూ.8 లక్షలు భరణంగా ఇప్పించమని కోరింది. అంతేకాకుండా పెళ్ళైన తర్వాత పృథ్విరాజ్ విజయవాడలోని తమ ఇంట్లోనే ఉంటూ చెన్నైలో ప్రయత్నాలు చేసేవాడని, ఆ ఖర్చులన్నింటిని తన తల్లి దండ్రులే భరించేవారని పేర్కొంది. సినిమాల్లో స్టార్ డమ్ వచ్చాక తనను బాగా హింసించాడని, చివరికి తనను 2016 ఏప్రిల్ 5న ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మన్నాడని ఫిర్యాదులో శ్రీ లక్ష్మీ పేర్కొంది. దాదాపు నాలుగేళ్ళకు పైగా కొనసాగిన ఈ కేసుపై ఫైనల్గా శ్రీలక్ష్మీకి అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది. ప్రతి నెల 10వ డేట్ వరకు రూ.8 లక్షలు పృథ్విరాజ్ భరణంగా చెల్లించాలని ఆదేశాలు జారి చేసింది. అంతేకాకుండా కేసు దాఖలు చేసినప్పటి నుండి అయిన ఖర్చు మొత్తాన్ని కూడా ఆయనే ఇవ్వాలని తీర్పునిచ్చింది.