నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి’. శ్రీనివాస్ అవసరాల దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. గురువారం టీజర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ ‘అవసరాల శ్రీనివాస్తో నాకిది మూడో చిత్రం. ‘ఊహలు గుసగుసలాడే’ ‘జో అచ్యుతానంద’ తరహాలో ఫీల్గుడ్ ఎంటర్టైనర్గా గుర్తుండిపోతుంది. ఇలాంటి కథ మళ్లీ రాదనుకుంటున్నా.
కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యాక ఆనందం కలుగుతుంది. కానీ ఈ సినిమా విషయంలో విడుదలకు ముందే ఆనందంగా ఉన్నా. తప్పకుండా అందరిని మెప్పించే చిత్రమవుతుంది’ అన్నారు. ‘ఈ కథ సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. నిజజీవితంలో వ్యక్తులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలాంటి సహజ సంభాషణలు ఉంటాయి. మనచుట్టూ ఉండే మనుషుల కథ ఇది’ అని దర్శకుడు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ప్రేమకథతో పోల్చుకునే సినిమా ఇదని కథానాయిక మాళవిక పేర్కొంది. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ చెప్పారు.