వెంకటేష్, వరుణ్తేజ్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్-3’. అనిల్రావిపూడి దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్నా, మెహరీన్, సోనాల్చౌహాన్ కథానాయికలు. ప్రస్తుతం ప్రధాన తారాగణమంతా పాల్గొనగా హైదరాబాద్లో కీలక ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ‘ఆద్యంతం హాస్య ప్రధానంగా సాగే చిత్రమిది. ప్రతి పాత్ర కడుపుబ్బా నవ్విస్తుంది. రాజేంద్రప్రసాద్, సునీల్ వంటి తారల వల్ల వినోదాల డోస్ మరింత ఎక్కువైంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. వినోదాల విందులా ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, నిర్మాణ సంస్థ: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, దర్శకత్వం: అనిల్ రావిపూడి.