నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. వక్కంతం వంశీ దర్శకుడు. రుచిర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం ఈ సినిమా నుంచి ‘ఓలే ఓలే పాపాయి’ అనే పాటను విడుదల చేశారు. హేరిస్ జైరాజ్ సంగీత సారథ్యంలో రామ్ మిర్యాల, ప్రియా హేమెస్ ఈ పాటను ఆలపించారు. దర్శకుడు వక్కంతం వంశీ మాట్లాడుతూ ‘ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభిస్తున్నది.
ట్రైలర్ చూసిన వారు ట్రైలర్లాగే సినిమా కూడా ఫుల్లెంగ్త్ కామెడీతో ఉంటుందా అని అడుగుతున్నారు. ట్రైలర్కు పదింతల వినోదంతో సినిమా ఆకట్టుకుంటుంది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారు’ అన్నారు. ‘ఇప్పటివరకు నేను చేసిన క్యారెర్టర్స్లో ఇదే బెస్ట్ అవుతుంది. ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్తో కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది’ అని హీరో నితిన్ అన్నారు. టైటిల్ తగినట్లుగానే సినిమా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుందని నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.