జస్వంత్ పడాల, నక్షత్ర త్రినయని జంటగా నటిస్తున్న సినిమా ‘ఎర్రర్ 500’. ఈ చిత్రాన్ని మైత్రేయ మోషన్ పిక్చర్స్ పతాకంపై యూ బాలరెడ్డి నిర్మిస్తున్నారు. సాందీప్ మైత్రేయ ఎన్ దర్శకుడు. ఈ చిత్ర టీజర్ను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..‘తెలుగు చిత్ర పరిశ్రమలోకి మరింత యువత రావాలి. వారినే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. టీమ్ అంతా సినిమా మీద ఇష్టంతో పనిచేసినట్లు తెలుస్తున్నది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’ అన్నారు. దర్శకుడు సాందీప్ మైత్రేయ మాట్లాడుతూ…‘యూత్ఫుల్ చిత్రమిది. ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం’ అన్నారు. త్రినాథ్ వర్మ, రాజీవ్ కనకాల, సంజయ్ స్వరూప్, రోహిణీ హట్టంగడి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.