లక్ష్మణ్, కిషోరి దాత్రక్ జంటగా రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. నాగశశిధర్రెడ్డి దర్శకుడు. ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్నిచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ ‘కామెడీ ఎంటర్టైనర్ ఇది. టైటిల్ను త్వరలో ప్రకటిస్తాం. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలుంటాయి. ఈ నెల 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అరుణ్కుమార్ సంగీతం: రుద్ర కిరణ్, నిర్మాతలు: పార్థసారథి, డి.నాగేందర్రెడ్డి, రచన-దర్శకత్వం: డి. నాగశశిధర్రెడ్డి.