సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మధుర వైన్స్’. జయకిషోర్ బండి దర్శకత్వంలో రాజేష్ కొండెపు, సృజన యారబోలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో చిత్రంపై ఆసక్తి పెరిగింది. తప్పకుండా వారి అంచనాలకు మించి సినిమా వుంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తిక్ కుమార్, జయక్రిష్.