బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మించిన ట్రిపుల్ ఎక్స్ వెబ్సిరీస్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్యకరమైన సన్నివేశాలతో యువతను తప్పుదోవ పట్టించేవిధంగా ఉందని వ్యాఖ్యానించింది. ఏక్తా కపూర్ సొంత ఓటీటీ ప్లాట్ఫాం ఆల్ట్బాలాజీలో ట్రిపుల్ ఎక్స్ వెబ్ సిరిస్ స్ట్రీమింగ్ అవుతున్నది. అందులోని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మాజీ సైనికుడొకరు రెండేళ్ల క్రితం బీహార్లోని కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఏక్తాకపూర్పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. దీనిని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓటీటీలో తమకు నచ్చిన కంటెంట్ను ఎంచుకునే వీలు ఉందంటూ ఏక్తాకపూర్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. వీటిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఏక్తాకపూర్ ప్రతిసారీ ఇలాంటి వివాదాలతో కోర్టును ఆశ్రయించడం మంచి పద్దతి కాదంటూ హితవు పలికింది. మరోసారి ఈ తరహా చర్యల్ని పునరావృతం చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.