రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. 80వ దశకంలో స్టూవర్టుపురంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వంశీ దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. అక్టోబర్ 20న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర మ్యూజికల్ ప్రమోషన్స్ను ముమ్మరం చేశారు. మంగళవారం ‘ఏక్దమ్ ఏక్ దమ్’ అనే గీతాన్ని విడుదల చేశారు.
జీవీ ప్రకాష్కుమార్ స్వరపరచిన ఈ గీతానికి భాస్కరభట్ల సాహిత్యాన్నందించారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. యూత్ని, మాస్ను మెప్పించే గీతమిదని, హుషారైన స్టెప్పులతో అలరిస్తుందని చిత్ర బృందం పేర్కొంది. నూపూర్ ససన్, గాయత్రి భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్.మది, సంగీతం: జీవీ ప్రకాష్కుమార్, సంభాషణలు: శ్రీకాంత్ విస్సా, రచన-దర్శకత్వం: వంశీ.