రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ధమాకా’. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీలీల నాయికగా నటిస్తున్నది. ఈ సినిమాలో ‘డూ డూ’ అనే పాటను ఇటీవల విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో భీమ్స్ సిసిరోలయో స్వరపర్చగా పృథ్వీ చంద్ర ఆలపించారు.
ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఈ పాట ద్వారా తెలుస్తున్నది. ఒకరు క్లాస్, మరొకరు మాస్. ఈ ఇద్దరి స్వభావాన్ని వర్ణిస్తూ పాట సాగింది. ‘వీడు కాలరెత్తె పొగరు, వాడు కార్పొరేట్ పవర్..’ అనే లైన్స్ హీరో డ్యూయర్ రోల్ క్యారెక్టర్స్ను చూపిస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 23న విడుదలకానుంది.