మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘దృశ్యం’ తెలుగులో రీమేక్ అయి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రలలో శ్రీ పియ ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఆ తర్వాత మోహన్ లాల్ ‘దృశ్యం -2’ చేశారు. దీనిని కూడా తెలుగులో రీమేక్ చేయాలని భావించిన వెంకటేశ్, మాతృకకు దర్శకత్వం వహించిన జీతూ జోసఫ్ నే ఎంపిక చేసుకున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లో విడుదల అవుతుందా లేక ఓటీటీలో రిలీజ్ అవుతుందా అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. -చదవండి : నేనున్నా అన్నా అంటూ ధైర్యం చెప్పిన ఎన్టీఆర్
తాజాగా వెంకటేష్ టీజర్ విడుదల చేస్తూ మూవీని అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేయనున్నట్టు పేర్కొన్నారు. నవంబర్ 25న ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. రాంబాబు కేసు ఏమైందనే దానిపై ఆ రోజు క్లారిటీ రానుందని తెలియజేశాడు. వెంకటేశ్ నటించిన మరో సినిమా ‘నారప్ప’ను ఓటీటీలో విడుదల చేయడంతో పెద్ద దుమారం చెలరేగింది. ఊహించని విధంగా పంపిణీదారుల నుండి సురేశ్ బాబు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పైగా ‘నారప్ప’ సినిమాకూ పెద్దంత పాజిటివ్ టాక్ రాలేదు. దీంతో దృశ్యం2 సినిమా థియేటర్స్లోనే విడుదల అవుతుందని అందరు అనుకున్నారు. కాని ఊహించని విధంగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు.
The truth has begun to unveil itself. But the question is – has it left a permanent scar on Rambabu?
— Venkatesh Daggubati (@VenkyMama) November 12, 2021
Watch #Drushyam2OnPrime, Nov. 25 on @PrimeVideoIN
▶️https://t.co/mL68iUtwzC#MeenaSagar #JeetuJoseph @SureshProdns @aashirvadcinema @antonypbvr @anuprubens #SatheeshKurup pic.twitter.com/YTkirX6oBH