‘ఇస్మార్ట్ శంకర్’గా రామ్తో పూరీజగన్నాథ్ చేయించిన హంగామా అంతాఇంతాకాదు. ఆ కేరక్టరైజేషన్కీ యువతరం ఫిదా అయిపోయారు. అందుకే.. ఇప్పుడు ఆ డోసును డబుల్ చేస్తూ.. ‘డబుల్ ఇస్మార్ట్’గా మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు రామ్, పూరీజగన్నాథ్. పూరీ కనెక్ట్స్ బేనర్పై చార్మీకౌర్తో కలిసి పూరీ జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబాయ్లో జరుగుతున్నది. బాలీవుడ్ స్టార్ సంజయ్దత్ ఇందులో ప్రత్యేక పాత్ర పోషిస్తుండటం విశేషం. వచ్చే ఏడాది మహాశివరాత్రి కానుకగా మార్చి 8న సినిమా విడుదల కానుంది.
అంటే ఇంకా వందరోజులు సమయం ఉందన్నమాట. ఈ సందర్భంగా కౌంట్డౌన్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. సినిమాలో మనం చూడబోతున్న యాక్షన్ వైబ్ని ఈ పోస్టర్ ఆవిష్కరించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ అన్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో భారీగా విడుదల కానున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సంగీతం: మణిశర్మ.