మాళవిక సతీషన్, అజయ్ఘోష్, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దోచేవారెవరురా’. శివ నాగేశ్వరరావు దర్శకుడు. బొడ్డు కోటేశ్వర రావు నిర్మాత. మార్చి 11న విడుదలకానుంది. ఇటీవల దర్శకుడు హరీష్శంకర్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. దర్శకుడు శివనాగేశ్వరరావు మాట్లాడుతూ ‘డబ్బు చూట్టూ తిరిగే కథ ఇది. ప్రస్తుతం ప్రజలు ఎలా దోపిడికి గురవుతున్నారో చూపించాం. సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్గా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది’ అన్నారు. ఆద్యంతం అద్భుతమైన కామెడీతో అలరించే చిత్రమిదని నిర్మాత కోటేశ్వరరావు తెలిపారు. మాస్టర్ చక్రి, జెమిని సురేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: గణేష్ అర్లి, సంగీతం: రోహిత్ వర్ధన్, కార్తీక్, నిర్మాణ సంస్థ: ఐ క్యూ క్రియేషన్స్, దర్శకత్వం: శివనాగేశ్వరరావు.