Pushpa The Rule | టాలీవుడ్తోపాటు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ టాలీవుడ్ ప్రాజెక్టుల్లో ఒకటి పుష్ప.. ది రూల్ (Pushpa The Rule ). పుష్ప.. ది రైజ్కు సీక్వెల్గా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. కేజీఎఫ్ లైన్లో పుష్ప ది రూల్ ఫుల్ లెంగ్త్ హై డోస్ ఎలివేషన్తో ఉండబోతుందట. తాజా టాక్ ప్రకారం సీక్వెల్లో ఎనిమిది యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయి.ఆ యాక్షన్ సీక్వెన్స్ విజువల్ ట్రీట్ ఇవ్వడమే కాదు.. గూస్ బంప్స్ తెప్పించేలా ఉండనున్నాయని ఇన్సైడ్ టాక్.
వీటిలో ప్రత్యేకించి అల్లు అర్జున్-ఫహద్ ఫాసిల్ మధ్య వచ్చే నాలుగు యాక్షన్ సన్నివేశాలు, జగపతిబాబుతో వచ్చే ఒక యాక్షన్ సీన్ మైండ్ బ్లోయింగ్గా ఉండబోతున్నాయని తాజాగా ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తూ.. మూవీ లవర్స్తోపాటు బన్నీ అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. విదేశీ కొరియోగ్రాఫర్ల టీం, ప్రత్యేకించి హాలీవుడ్కు చెందిన టీం ఈ ఫైట్స్ను కంపోజ్ చేస్తుంది. మొత్తానికి సీక్వెల్లో ఉండబోయే యాక్షన్ పార్టు మాస్ సెంటర్లను షేక్ చేయడం గ్యారంటీ అని ఫిలింనగర్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
అంతేకాదు సుకుమార్-బన్నీ టీం ఇరగదీసే కొత్త కొత్త హుక్ స్టెప్స్ కోసం డ్యాన్స్ కొరియోగ్రాఫర్ల టీంకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారట. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ నుంచి మరో చార్ట్ బస్టర్ ఆల్బమ్ రాబోతుందని అంటున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై ఫస్ట్ పార్టును మించిన బడ్జెట్తో తెరకెక్కిస్తోంది. ఫస్ట్ పార్టులో శ్రీవల్లిగా నటించిన కన్నడ సోయగం రష్మిక మందన్నా రెండో పార్టులో కూడా సందడి చేయనుంది. ఇటీవలే పుష్ప ది రూల్ కొత్త షెడ్యూల్లో జాయిన్ అవుతున్నట్టు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది రష్మిక.