ఒకసారి పెద్ద సినిమాలు చేయలేని మ్యాజిక్ చిన్న సినిమాలు చేసి చూపిస్తాయి. ఇప్పుడు డీజే టిల్లు సినిమా విషయంలో ఇదే జరుగుతోంది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా తొలి రెండు రోజుల్లో ఏకంగా రూ.7.50 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మూడో రోజు కూడా చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి.
వీక్ డేస్ మొదలైన తర్వాత కూడా డీజే టిల్లు రీసౌండ్ వస్తుంది. వచ్చే వారం కూడా పెద్ద సినిమాలు పోటీలో లేవు. దాంతో టిల్లు బ్లాక్ బస్టర్ అవడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 18న మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా తప్ప పెద్దగా సినిమాలు రావడం లేదు. ఇది డిజే టిల్లు సినిమాకు బాగా కలిసి రానుంది. ఓవర్సీస్ లో ఈ సినిమా దూకుడు చూసి అందరూ షాక్ అవుతున్నారు. 2022 బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ సినిమా.
సంక్రాంతికి వచ్చిన బంగార్రాజు కూడా అంత వసూలు చేయలేకపోయింది. కానీ డీజే టిల్లు మాత్రం ఇప్పటికే 4 లక్షల డాలర్లు వసూలు చేసింది. మరో రెండు రోజుల్లో కచ్చితంగా హాఫ్ మిలియన్ మార్క్ చేరుకోనుంది ఈ సినిమా. టిల్లు దూకుడు మరింత కొనసాగేలా కనిపిస్తోంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రేక్షకులు థియేటర్లకు హాయిగా వస్తున్నారు.