లోఫర్ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన నటించిన గ్లామర్ డాల్ దిశా పటాని బాలీవుడ్లోను సత్తా చాటుతుంది. ఓ వైపు సినిమాలు మరోవైపు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ తనకంటూ ప్రత్యేక అభిమానగణం ఏర్పరచుకుంటుంది. దిశా పటాని గ్లామర్ షోకు లిమిట్ అనేది ఏమి ఉండదు. తరచు బికినీలలో రెచ్చిపోయే ఈ అమ్మడు తాజాగా బికినీలో మెరిసింది. బీచ్ సెలబ్రేషన్స్లో ఉన్న దిశా ఇసుకలో కూర్చొని ఆలోచనలో మునిగింది.
దిశా పటాని బికినీ పిక్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. దీనిపై నెటిజన్స్ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఈ అమ్మడు రీసెంట్గా సల్మాన్ ఖాన్ సరసన రాధే అనే చిత్రంలో నటించింది. ఈ ఏడాదికి విడుదల కావలసిన ఈ చిత్రం కరోనా వలన వచ్చే ఏడాది ఈద్కు షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది. కాగా, దిశా పటాని ఇతర ప్రాజెక్టులతోను బిజీగా ఉండగా, తెలుగులోను సినిమాలు చేయాలని టాలీవుడ్ అభిమానులు కోరుతున్నారు.