శాంతిచంద్ర, దీపికా సింగ్, సిమ్రితి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డర్టీఫెలో’. ఆడారి మూర్తి సాయి దర్శకుడు. జి.యస్.బాబు నిర్మాత. ఈ సినిమాలోని ‘సందెవేళ..’ అనే పాటను దర్శకుడు సాయిరాజేష్ విడుదల చేశారు. ‘రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. హీరో పాత్ర కొత్త పంథాలో ఉంటుంది.
నేటి యువతరానికి కనెక్ట్ అయ్యే అన్ని అంశాలుంటాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. సత్యప్రకాష్, నాగినీడు, జయశ్రీ, సురేంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామకృష్ణ, సంగీతం: సతీష్కుమార్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: ఆడారి మూర్తి సాయి.