‘ఆదికేశవ’ కథ చాలా కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులు ఎక్కడా బోర్ ఫీలవకుండా ఆసాంతం ఆకట్టుకునే కమర్షియల్ కథాంశమిది’ అన్నారు చిత్ర దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో వైష్ణవ్తేజ్, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ “భీమ్లానాయక్’ సెట్లో నిర్మాత నాగవంశీకి ఈ కథ చెప్పాను. ఆయన వెంటనే ఓకే చెప్పారు. అలా సితార ఎంటర్టైన్మెంట్స్లో నా ప్రయాణం మొదలైంది.
హైదరాబాద్లో ఉండే ఓ సాధారణ యువకుడు అనంతపురం దగ్గరలోని కల్యాణదుర్గం బ్రహ్మసముద్రం అనే గ్రామంలో జరుగుతున్న అన్యాయాలపై ఎలా పోరాటం చేశాడన్నదే చిత్ర కథాంశం. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. పోరాట ఘట్టాల్లో వాడిన ఆయుధాలు ప్రత్యేకంగా నిలుస్తాయి.
సందర్భానికి తగినట్లుగా వెపన్స్ ఉపయోగించాం. వైష్ణవ్తేజ్ పాత్ర చిత్రణ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సినిమా ైక్లెమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది. చివరి 45 నిమిషాల సినిమా అద్భుతంగా వచ్చిందని, ఇప్పటిదాకా అలాంటి ైక్లెమాక్స్ చూడలేదని చాలా మంది ప్రశంసించారు. జీవీ ప్రకాష్ సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. పాటలు, నేపథ్య సంగీతం బాగా కుదిరాయి. ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం’ అన్నారు.