అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బుట్ట బొమ్మ’. ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు. ఈ నెల 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు శౌరి చంద్రశేఖర్ రమేష్.
రీమేక్కు పనికొచ్చే కథాంశమిది వర్మ కార్పొరేషన్లో శూల్ అనే చిత్రానికి పనిచేశాను. హైదరాబాద్ వచ్చి దర్శకుడు సుకుమార్ దగ్గర ‘జగడం’ నుంచి ‘పుష్ప’ వరకు వర్క్ చేశాను. లాక్ డౌన్ సమయంలో ‘కప్పేలా’ చిత్రాన్ని చూశాను. కొన్ని చిత్రాలను రీమేక్ చేయగలం, కొన్నింటిని చేయలేం. ఇది పూర్తిగా స్క్రిప్ట్ మీద ఆధారపడిన సినిమా. మన అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేసి రీమేక్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’, ‘కప్పేలా’ రెండు చిత్రాల రీమేక్ హక్కులు సితార సంస్థలో ఉన్నాయని తెలిసి వారిని సంప్రదించాను. కొన్ని చర్చల అనంతరం ఈ చిత్ర రీమేక్కు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. ఈ కథలోని ప్రధానాంశం అలాగే ఉంచి మన నేటివిటీకి తగిన మార్పులు చేశాం.
ప్రథమార్థంలో కామెడీ, ఎమోషన్స్ విషయంలో కొన్ని కీలక సన్నివేశాలు రూపొందించాం.
చిత్రం ఆద్యంతం ఒక కాన్సెప్ట్తో సాగుతుంటుంది. సినిమాను నిర్మాత చినబాబు, దర్శకుడు త్రివిక్రమ్ చూశారు. సినిమా బాగుందంటూ వారు ఇచ్చిన ప్రశంసలు మర్చిపోలేను. నా తదుపరి సినిమా యాక్షన్ జానర్లో రూపొందిస్తాను.