హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకున్నది. మొన్న సీనియర్ నటి, తెలుగింటి సత్యభామ జమున మరణించగా.. నేడు ప్రముఖ దర్శకుడు సాగర్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాగర్.. చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సాగర్.. స్టువర్ట్పురం, అమ్మదొంగ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. మూడుసార్లు తెలుగు సినిమా దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు.