Rajamouli | రాజమౌళి క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. ఇన్నాళ్లు మనం స్టివెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి దర్శకులను ఎలా గుర్తుచేసుకున్నామో.. ఇప్పుడు హాలీవుడ్ ప్రేక్షకులు రాజమౌళి పేరును జపం చేస్తున్నారు. ప్రేక్షకులనే కాదు, హాలీవుడ్ దిగ్గజాలు సైతం రాజమౌళి ప్రతిభను మెచ్చుకుంటున్నారు. ‘బాహుబలి’తో టాలీవుడ్ స్థాయిని పెంచిన రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’తో ఏకంగా ఇండియన్ సినిమా స్థాయిని పెంచాడు. ముఖ్యంగా హాలీవుడ్ సినీ ప్రముఖులు ఇండియన్ సినిమా గురించి గొప్పగా మాట్లాడుకునేలా చేశాడు. రాజమౌళి టేకింగ్కు, విజన్కు హాలీవుడ్ దర్శకులు, టెక్నీషియన్లు సైతం ఫిదా అయ్యారు. ఇటీవలే ‘గోల్డెన్ గ్లోబ్’ అందుకున్న ‘నాటు నాటు’ ఇప్పుడు ‘ఆస్కార్’ కోసం పోటీ పడుతుంది.
ఆస్కార్ పురస్కారాలు దగ్గరపడిన తరుణంలో జక్కన్న హాలీవుడ్లో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో భాగంగా మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కాగా ఓ ఇంటర్వూలో భాగంగా తన తండ్రి రాసిన ఓ స్క్రిప్ట్ చదివి ఏడ్చానని చెప్పాడు. విజయేంద్రప్రసాద్ ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో ఓ కథ రాస్తున్నాడు. దానికి గురించి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ గురించి నాకు తెలియదు. అది ఒక సంస్థ మాత్రమేనని తెలుసు. అది ఏ విధంగా ఏర్పడింది. ఆ సంస్థ భావజాలం ఏంటనేది నాకు తెలియదు. కానీ, మా నాన్న రాసిన ‘ఆర్ఎస్ఎస్’ స్క్రిఫ్ట్ను చదివి నేను ఏడ్చాను. ఆ కథలో చాలా భావోద్వేగాలు ఉన్నాయి. నేను ఈ ప్రాజెక్ట్కు దర్శకత్వం వహిస్తానో లేదో తెలియదు. అసలు మా నాన్న ఆ స్క్రిప్ట్ ఎవరికోసం రాసారనేది కూడా నాకు తెలియదు. కానీ, ఆ కథను తెరకెక్కించే అవకాశం వస్తే మాత్రం నేను గౌరవంగా భావిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం రాజమౌళి మహేష్తో పాన్ వరల్డ్ సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్తో వచ్చిన క్రేజ్తో ఇంకాస్త గ్రాండియర్గా సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ ప్రపంచం మొత్తం చుట్టేసే వాడిగా కనిపించనున్నట్లు జక్కన్న ఇదివరకే వెల్లడించాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు ఇంగ్లీష్లో ఏకకాలంలో తెరకెక్కిస్తారట. ఆ తర్వాత మిగితా భాషల్లో డబ్ చేస్తారట.