Khiladi movie | మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ఖిలాడీ. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. విడుదలైన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో లేదని, రవితేజ నటన బాగున్నా ,కథ లేదని నెటీజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే రవితేజకు,రమేష్వర్మకు మధ్య గొడవలు అయ్యాయని తెలుస్తుంది. ఖిలాడీ ప్రి రిలీజ్ ఈవెంట్లో రవితేజ స్పీచ్ అనుమానాలను రేకెత్తెస్తున్నాయి. దర్శకుడిని టార్గెట్ చేసి మాట్లాడినట్టు అనిపిస్తుంది. దర్శకుడు మహార్జాతకుడు అని, ఆ జాతకానికి, అదృష్టానికి ఓ పేరుంది..అది కోనేరు సత్యనారాయణ. సినిమా రిలీజ్ కాకముందే దర్శకుడుకి కారు గిఫ్ట్గా ఇచ్చాడు. ఈయన మహార్జాతకుడా కాదా అంటూ సెటైరికల్గా మాట్లాడాడు. ఇక నిర్మాత కోనేరు సత్యనారాయణ ఉద్దేశిస్తూ మీరు దగ్గరుండి అన్ని చూసుకోవాల్సింది. అప్పుడే అన్ని విషయాలు తెలుస్తాయని రవితేజ అనడం ఎన్నో అనుమానాలను కలుగజేసింది.
ఈ క్రమంలో రమేష్వర్మ భార్య రేఖావర్మ రవితేజపై ఇన్స్టాగ్రామ్లో వేసిన పోస్టులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో దర్శకుడు అజయ్ భూపతి చీప్ స్టార్ అనే మాట ఎందుకు అన్నాడో ఇప్పుడు అర్ధమవుతుంది అని రేఖావర్మ తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ పెట్టారు. మరొక స్టోరీలో అరటి పండు మీకు బాగా వచ్చు అనుకుంటా తియ్యడం.. డైరెక్టర్ గారు నెక్స్ట్ టైమ్ క్లాసెస్ తీసుకోండి RT దగ్గర. అరటి చెట్టు నరికి ఇచ్చినా సరిపోలేదు RT కి అంటూ రవితేజపై సెటైర్ వేశారు. డైరెక్టర్ కి ఒక స్టైల్ ఉంటుంది. అది మీకు చెప్పి చేయిస్తేనే కెమెరాలో యంగ్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తావు.. ఆ క్రెడిట్ దర్శకుడికే దక్కుతుంది అంటూ వేసిన పోస్ట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై రవితేజ ఫ్యాన్స్ రేఖా వర్మపై మండిపడుతున్నారు. అస్సలు రవితేజకు రమేష్వర్మకు మధ్య విభేదాలకు కారణం ఏమైయ్యుంటుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. గతంలో వీరిద్దరూ కలిసి వీర సినిమాను చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది.