బాలీవుడ్ యువ హీరోలు టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్లతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని ప్రకటించారు దర్శక నిర్మాత కరణ్ జోహార్. తన ధర్మ ప్రొడక్షన్స్లో ఆయన ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించనున్నారు. కరణ్ జోహార్ తన రొమాంటిక్, ఫ్యామిలీ మూవీస్కు భిన్నంగా ఈసారి యాక్షన్ చిత్రాన్ని ఎంచుకోవడం విశేషం. ధర్మ ప్రొడక్షన్స్ ఈ మేరకు సోషల్ మీడియాలో సూచన చేసింది.
యాక్షన్ సినిమాల హీరోగా టైగర్ ష్రాఫ్ ఇప్పటికే పేరు తెచ్చుకోగా…వరుణ్ విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్నారు. కరణ్ దర్శకుడిగా తన తరహాను మార్చి ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన టీమ్ మెంబర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్లో ఉన్న ఈ సినిమాకు నాయికలను వెతికే పనిలో చిత్రబృందం ఉన్నారట.