Director Parusaram | ‘గీతా గోవిందం’ రిలీజయ్యే వరకు డైరెక్టర్ పరుశురామ్ పేరే చాలా మందికి తెలియదు. అప్పటివరకు ఆయన కెరీర్లో చెప్పుకొద్దగ సినిమాలు కూడా ఏవి లేవి. కానీ ఐదేళ్ల కిందట వచ్చిన ‘గీతా గోవిందం’తో ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. 25కోట్ల మార్కెట్ ఉన్న విజయ్తో 70 కోట్ల్ షేర్ను సాధించి ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు. అదేం పెద్ద గొప్ప సినిమా కాకపోవచ్చు. కానీ టిక్కెట్ కొనుక్కొని థియేటర్కు వచ్చిన ప్రతీ ప్రేక్షకుడు ఫుల్ సాటిస్ఫై అయ్యాడు. ఆ సినిమా పుణ్యమా అని ఏకంగా మహేష్తో సర్కారువారి పాట సినిమా చేసే చాన్స్ కొట్టేశాడు. అయితే మహేష్ను హ్యాండిల్ చేయడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న మహేష్ ఫ్యాన్స్ను తీవ్రంగా నిరాశపరిచాడు.
ఈ సినిమా ప్రభావం పరుశురామ్పై గట్టిగానే పండింది. సినిమా విడుదలై ఏనిమిది నెలలు దాటినా ఇంకా మరో ప్రాజెక్ట్ను లాక్ చేసుకోలేకపోయాడు. మధ్యలో నాగచైతన్యతో సినిమా అంటూ విశ్వప్రయత్నాలు చేసిన ఫైనల్ నెరేషన్ నచ్చలేదని చై రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత బాలయ్యతో చర్చలు జరిపినా అది కూడా అది కూడా ఫలించలేదు. దాంతో తనకు స్టార్ డైరెక్టర్ ట్యాగ్ ఇచ్చిన విజయ్తోనే మరోసారి సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ఇక్కడే పెద్ద చిక్కు వచ్చింది. ముందుగా గీతాఆర్ట్స్ బ్యానర్లో విజయ్తో ఓ సినిమా పరుశురామ్ అడ్వాన్స్ తీసుకున్నాడు. కానీ అనూహ్యంగా దిల్రాజుతో ప్రకటించడం పెద్ద దుమారమే రేపింది.
ఈ ఇష్యూతో మెల్లిగా పరుశురామ్ కమిట్మెంట్ల జాబితా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. పరుశురామ్ గీతాఆర్ట్స్ బ్యానర్లో రెండు సినిమాలకు సైన్ చేశాడట. దీనితో పాటుగా 14రీల్స్తో ఓ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడట. ఇక దిల్రాజుకు గతంలోనే ఓ సినిమా చేసి పెట్టాల్సిందట. ఇక ఇప్పుడు అది కుదిరింది. అలాగే సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ దగ్గర ఎప్పుడో అడ్వాన్స్ తీసుకున్నాడట. కానీ ఈ ప్రాజెక్ట్ ఊసే లేదు. ఇక సురేష్ ప్రొడక్షన్లో కూడా ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. దీని లెక్క కూడా తేలనేలేదు. ఇవన్నీ ఒకటైతే మంచు వారికి కూడా ఎప్పుడో సినిమా చేస్తున్నట్లు కమిట్మెంట్ ఇచ్చాడట. ఆ కమిట్మెంట్ ఇచ్చి దాదాపు పదేళ్లు అవుతుందట. మరీ ఇందులో నిజంగా అందరికి కమిట్మెంట్ ఇచ్చాడా లేక కొందరికి ఇచ్చాడా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అసలు ఇందులో నిజమెంతుందో తెలియాలంటే పరుశురామే స్పందించాల్సి ఉంటుంది.