దర్శకుడు మణిరత్నం రూపొందించిన చారిత్రక నేపథ్య చిత్రం ‘పొన్నియన్ సెల్వన్ 1’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నది. తమిళనాట ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమా ఓవర్సీస్లో కూడా మంచి వసూళ్లు సాధిస్తున్నది. ఫుల్ రన్లో ఈ చిత్రానికి దాదాపు 500 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ చేరుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాలో 4 మిలియన్ డాలర్ల మార్క్ను అందుకుందీ చిత్రం. తమిళనాట నెంబర్ వన్ మూవీగా అవతరించింది.
ఇటీవల కమల్ హాసన్ సాధించిన ‘విక్రమ్’ బాక్సాఫీస్ అంకెలను ఈ హిస్టారికల్ మూవీ తుడిచేస్తున్నది. ఈ సినిమాలో కుందవై పాత్రలో త్రిష చక్కటి అభినయాన్ని కనబరచింది. సినిమా విజయం పట్ల త్రిష ఆనందం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ ‘నా కెరీర్లో ఇప్పటికే ఎన్నో భారీ విజయాల్ని చూశాను. అయితే ‘పొన్నియన్ సెల్వన్-1’ చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. నా కెరీర్లోనే బెస్ట్ రోల్ని పోషించినందుకు గర్వంగా ఉంది’ అని త్రిష పేర్కొంది.