చిరంజీవిని డైరెక్ట్ చేయడం చాలామంది దర్శకుల కల. కానీ చిరంజీవి మాత్రం అందరికీ షాకిస్తూ, ఒకేఒక్క సినిమాను డైరెక్ట్ చేసిన యువదర్శకుడు మల్లిడి వశిష్ఠకు అవకాశం ఇచ్చేశారు. కల్యాణ్రామ్తో వశిష్ఠ చేసిన ‘బింబిసార’ మంచి హిట్. అయితే, ఒక్క హిట్తో ప్రతిభను అంచనా వేయలేం. కానీ చిరంజీవి మాత్రం మరో ఆలోచన చేయకుండా వశిష్ఠకు భారీ అవకాశం వచ్చేశారు. మెగాస్టార్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు వశిష్ఠ అహర్నిశలూ శ్రమిస్తున్నాడని టాక్. చిరంజీవితో ఆయన చేస్తున్న చిత్రానికి ‘విశ్వంభర’ టైటిల్ ఖరారు చేశారు. టైటిల్తోనే మార్కులు కొట్టేశారు వశిష్ఠ. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్న విషయం తెలిసిందే. సినిమా ప్రకటన వెలువడ్డ దగ్గర్నుంచి అనేకమైన రూమర్లు వినిపిస్తూనే వున్నాయి. అయిదుగురు హీరోయిన్లని, హీరో ముల్లోకాలు తిరిగొస్తాడని, ఆ సినిమాకు సీక్వెల్ అని, ఈ సినిమాకు ప్రీక్వెల్ అని చాలా రూమర్లు మీడియాలో హల్చల్ చేశాయి. అయితే.. వాటన్నింటికీ ఒక్క సమాధానంతో తెరదించేశాడు వశిష్ఠ. ‘ఈ సినిమా గురించి వినిపిస్తున్న వార్తల్లో నిజంలేదు. ఇది పూర్తిగా కొత్త కథ. ఇందులో మెగాస్టార్, అభిమానులు కోరుకున్నట్టే కనిపిస్తారు. దానితోపాటు నేను అనుకున్న ఫాంటసీ మాత్రమే ఉంటుంది.’ అని సింపుల్గా తేల్చేశాడు.