హోమానంద్, రేవంత్, సిమ్రాన్ పరింజా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఈ కథలో నేను..’. ఎం.ఎస్.ఫణిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టి.కేశవతీర్థ నిర్మించారు. శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్ను అగ్ర దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘లవ్ అండ్ లస్ట్ కాన్సెప్ట్తో తెరకెక్కించిన చిత్రమిది.
నేటి యువతకు బాగా కనెక్ట్ అవుతుంది. కథానుగుణంగా చక్కటి సంగీతం కుదిరింది’ అన్నారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత పేర్కొన్నారు. నరేష్, పోసాని కృష్ణమురళి, మధునందన్, తేజస్విని, అభయ్ బేతిగంటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మల్హర్ భట్ జోషి, సంగీతం: యోగిశ్రీ, సమర్పణ: అచ్చిబాబు, దర్శకత్వం: ఎమ్.ఎస్. ఫణిరాజ్.