‘విరూపాక్ష’ చిత్రంతో ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు కార్తీక్ వర్మ. మిస్టిక్ థ్రిల్లర్ కథాంశంతో ‘విరూపాక్ష’ చిత్రాన్ని తెరకెక్కించిన ఈ యువ దర్శకుడు తన తాజా చిత్రాన్ని మిథికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించబోతున్నాడు.
ఈ చిత్రాన్ని ‘విరూపాక్ష’ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీలుక్ పోస్టర్ను సోమవారం విడుదల చేశారు మేకర్స్. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు.