సల్మాన్ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కభీ ఈద్ కభీ దివాళి’ వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి ఫర్హాద్ సమ్జీ తప్పుకున్నాడని సమాచారం. సల్మాన్ఖాన్తో విభేదాల కారణంగానే ఫర్హాద్ సమ్జీ సినిమాకు దూరమయ్యారని అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. గత ఏడాది అక్టోబర్లో సాజిత్ నదియావాలా నిర్మాణంలో ‘కభీ ఈద్ కభీ దివాళి’ సినిమా ప్రారంభమైంది. కోవిడ్ కారణంగా షూటింగ్కు బ్రేక్ పడింది. ఇటీవలే తిరిగి చిత్రీకరణ ప్రారంభించారు. అయితే తొలి షెడ్యూల్ అవుట్పుట్ చూసి సల్మాన్ఖాన్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారట. దీంతో రీషూట్ చేయాలని నిర్మాతను కోరినట్లు తెలిసింది. ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన దర్శకుడు ఫర్హాద్ సమ్జీ దర్శకత్వ బాధ్యతల నుంచి వైదొలిగారని అంటున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా దర్శకత్వ వ్యవహారాలను సల్మాన్ఖాన్ పర్యవేక్షిస్తున్నారు. మరో దర్శకుడి అవసరం లేకుండా స్వీయ దర్శకత్వంలోనే షూటింగ్ పూర్తిచేయాలని సల్మాన్ఖాన్ భావిస్తున్నాడట.