బండి సరోజ్కుమార్ స్వీయదర్శకత్వంలో నిర్మించి, నటించిన చిత్రం ‘పరాక్రమం’. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిపారు. విశ్వక్సేన్, దర్శకులు బుచ్చిబాబు సాన, జ్ఞానసాగర్ ద్వారక, నిర్మాత ఎస్.కె.ఎన్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. ఓ యజ్ఞంలా ఈ సినిమా చేశామని, అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చేలా ఈ ‘పరాక్రమం’ ఉంటుందని దర్శక, నిర్మాత, హీరో బండి సరోజ్కుమార్ తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్సభ్యులందందరూ మాట్లాడారు. శృతి సమన్వి, నాగలక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోవు, అనిల్కుమార్ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ఆర్.ప్రసాద్, నిర్మాణం: బి.ఎస్.కె.మెయిన్స్ట్రీమ్.