ఆకాష్పూరి, గెహనా సిప్పీ జంటగా నటిస్తున్న చిత్రం ‘చోర్ బజార్’. జీవన్ రెడ్డి దర్శకుడు. ఐవీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘మా స్వస్థలం భీమవరం. తొలుత సహాయ దర్శకుడిగా పనిచేశా. ఆ సమయంలోనే దర్శకుడు జీవన్రెడ్డితో పరిచయం ఏర్పడింది. చోర్ బజార్ హైదరాబాద్లో ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. నిజాం కాలంలో దొంగిలించిన వస్తువులను అక్కడే అమ్మేవారని చెబుతారు.
ఇప్పుడు కూడా ప్రతి గురువారం అమ్మకాలు జరుగుతుంటాయి. ఈ సినిమా కథకు ఆకాష్ పక్కాగా కుదిరాడు. కరోనా వల్ల సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైంది. ఇది రాత్రి జరిగే కథ. 35 రోజుల పాటు రాత్రి షూటింగ్ చేశాం. యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు.