ఒక సాధారణ విద్యార్థి సెలబ్రిటీగా ఎలా మారింది? ఎందుకు మారాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎదురైన అవాంతరాలను ఎలా ఎదుర్కొంది? అనే కథాంశంతో జీఎల్బీ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. సాయిచరణ్, పల్లవి జంటగా నటిస్తారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. నేటి యువత ఒకవైపు చదువులో రాణిస్తూనే, సెలబ్రిటీలుగా పేరు తెచ్చుకోవాలనే తపనతో వున్నారు. వారికి ప్రేరణ కలిగించే చిత్రంగా ఈ సినిమా వుంటుంది. కుటుంబ నేపథ్యంలో, వినోద ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లుగా దర్శకుడు తెలిపారు.