స్వీయ దర్శకత్వంలో సిరిపురం రాజేష్ నటిస్తున్న చిత్రం ‘కుట్ర’. (‘ది గేమ్ స్టార్ట్స్ నౌ’ ఉపశీర్షిక). ప్రీతి గీతిక, ప్రియా దేశ్పాల్ కథానాయికలు. ఈ నెల 23న విడుదలకానుంది. ఇటీవల ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు, నటుడు సిరిపురం రాజేష్ మాట్లాడుతూ ‘దర్శకుడిగా నా తొలి చిత్రమిది. చాలా ఏళ్ల నుంచి నేను మంచిర్యాలలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నా. క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. కథ, కథనాలు ఉత్కంఠగా సాగుతాయి. దాదాపు వంద థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి రోహిత్ శౌర్ సంగీతాన్నందిస్తున్నాడు.