Ashish reddy | 2022లో రౌడీ బాయ్స్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు అశిష్ రెడ్డి (Ashish reddy). ఈ క్రేజీ యాక్టర్ వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగు వేయబోతున్నాడని తెలిసిందే. అశిష్ రెడ్డి-అద్విత రెడ్డి నిశ్చితార్థం 2023 నవంబర్లో జరిగింది. వీరిద్దరూ జైపూర్లో జరుగనున్న ఈవెంట్లో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.
ఫిబ్రవరి 14న జరుగనున్న ఈ వెడ్డింగ్ ఈవెంట్కు రావాల్సిందిగా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్కు ఆహ్వానం అందించింది దిల్ రాజు కుటుంబం. తారక్కు దిల్ రాజు, శిరీష్, అశిష్ ఆహ్వీనం అందిస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అద్విత రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త కూతురు. అశిష్ ప్రస్తుతం యూత్ఫుల్ ఎంటర్టైనర్ సెల్ఫిష్ సినిమాలో నటిస్తున్నాడు.