Diljit Dosanjh | ప్రముఖ నటుడు, గాయకుడు దిల్జిత్ దోసాంజ్ తన అమెరికా పౌరసత్వం (యూఎస్ సిటిజన్షిప్) గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఎట్టకేలకు స్పందించారు.
ఇటీవల ఒక లైవ్ ఇంటరాక్షన్లో అభిమాని అడిగిన గ్రీన్ కార్డ్ ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో హాస్యాస్పదంగా సమాధానమిచ్చారు. తాను ఒక కార్డును తీసుకుని దానికి గ్రీన్ కలర్ వేసుకుంటానని, ఈ విషయంపై తాను ఏమీ మాట్లాడదలచుకోలేదని నవ్వుతూ దాటవేశారు. తాను ఏ చిన్న మాట మాట్లాడినా అది పెద్ద వార్త అయిపోతుందని, ప్రపంచంలో ఈ డ్రామా ఎప్పటికీ ముగియదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి వీసాలు లేకుండా ఎవరైనా ఏ దేశానికైనా వెళ్లేలా ఉంటే బాగుంటుందని, ప్రపంచమంతా ఒక్కటే కావాలనేది తన అభిప్రాయమని పేర్కొన్నారు. కాగా, దిల్జిత్ 2022లోనే యూఎస్ పౌరసత్వం పొందారని, అప్పటి నుంచి అమెరికా పాస్పోర్ట్పైనే ప్రయాణిస్తూ, ఈ-వీసా ద్వారా భారతదేశానికి వస్తున్నారని ఇటీవల ఇండియన్ మీడియా ఒక కథనంలో పేర్కొంది. అయితే ఈ వార్తలకు దిల్జిత్ దోసాంజ్ క్లారిటీ ఇవ్వడంతే ఈ వివాదానికి ముగింపు పడినట్లు తెలుస్తుంది.