Dil Raju | తెలుగు ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిర్మాత దిల్ రాజు గెలుపొందారు. రసవత్తరంగా సాగిన ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ కీలక పోస్టులను దక్కించుకున్నది. ఎన్నికల్లో మేజిక్ ఫిగర్ 25 కాగా.. ప్రత్యర్థి సీ కల్యాణ్పై దిల్ రాజుకు 31 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా ముత్యాల రామరాజు, కార్యదర్శిగా దామోదర ప్రసాద్, కోశాధికారిగా ప్రసన్న కుమార్ ఎన్నికయ్యారు.
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికలకు ఇవాళ ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ఎన్నికల్లో ప్రముఖ నిర్మాతలు సీ కల్యాణ్, దిల్ రాజు ప్యానెల్స్ మధ్య తీవ్రమైన పోటీ జరిగింది. ఛాంబర్లో మొత్తం 1,600 మంది సభ్యులుండగా.. 891 మంది ఓటుహక్కును వినియోగించారు. ప్రొడ్యూసర్ సెక్టార్లో 1,600 ఓట్లకు 891 ఓట్లు పోలయ్యాయి. స్టూడియో సెక్టార్లో 98 ఓట్లకు 68, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో 597 ఓట్లకు 380 పోలయ్యాయి.