Dil Raju | ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన మొదటి భార్య అనిత అనారోగ్యంతో చనిపోవడంతో తేజస్విని అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె అసలు పేరు వైఘారెడ్డి కాగా, ఇద్దరి జాతకాలను బట్టి పేరును మార్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. మొదటి భార్య అనిత మరణాంతరం దిల్ రాజు ఒంటరిగా ఉంటున్ననేపథ్యంలో అతనికి తోడుగా ఉండేందుకు జీవిత భాగస్వామి అవసరమని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయగా, ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ దంపతులకి ఓ బుడతడు కూడా ఉన్నాడు. అయితే తేజస్విని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తన ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు పోస్టులు షేర్ చేస్తూ ఉంటారు.
ఇంతకు ముందు ఎక్కువగా భర్త దిల్ రాజు, తనయుడు అన్వి రెడ్డితో కలిసి దిగిన ఫోటోలు లేదా వీడియోలు షేర్ చేసేది. కానీ ఇటీవలి కాలంలో ఆవిడ పర్సనల్ ఫోటోలు ఎక్కువగా షేర్ చేస్తున్నారు. అలాగే భర్తతో కలిసి ఫారిన్ వెకేషన్ వెళ్ళినప్పుడు సైతం అక్కడ తీసుకున్న ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. గతేడాది ఇంత ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్టులు చేయని తేజస్విని ఈ మధ్య మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. శనివారం జూన్ 21 న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా దేశమంతా ఘనంగా యోగా డే సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేకమంది సెలబ్రిటీలు యోగాసనాలు వేసి ఆ ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
ఈ నేపథ్యంలో దిల్ రాజు భార్య తేజస్విని కూడా యోగా డే సందర్భంగా ప్రత్యేకమైన వీడయో షేర్ చేసింది. ఇందులో పలు రకాల యోగాసనాలు చేస్తూ వాటికి సంబంధించిన పేర్లని కూడా పొందుపరిచింది. ఇది చూసిన వారు దిల్ రాజు భార్యలో ఇంత టాలెంట్ ఉందా అని నోరెళ్లపెడుతున్నారు. ప్రస్తుతం అయితే దిల్ రాజు భార్య తేజస్విని వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.