గత కొంత కాలంగా టాలీవుడ్లో షూటింగ్లు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆగస్టు 1 నుండి ఆగిపోయిన షూటింగ్లు ఇప్పటివరకు పునః ప్రారంభం కాలేదు. ఎప్పుడు షూటింగ్లు పునః ప్రారంభం అవుతాయో క్లారిటీ ఇంకా లేదు. కాగా తాజాగా ఫిలిం ఛాంబర్ సభ్యులు సీని పరిశ్రమ సమస్యలపై చర్చలు జరిపారు.
చర్చల అనంతరం దిల్రాజు మాట్లాడుతూ ‘మల్టీప్లెక్స్ ధరలపై చర్చించినట్లు’ తెలిపాడు. ‘ప్రేక్షకులకు ధరలు అందుబాటులో ఉండే విధంగా చర్చించామని, సింగిల్ స్క్రీన్ టిక్కెట్స్ ధరలపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని’ తెలిపాడు. ‘షూటింగ్లను కూడా త్వరలోనే మొదలు పెడతామని’ చెప్పాడు. అంతేకాకుండా ‘ఇక నుండి విడుదలయ్యే ప్రతి సినిమా 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుందని’ వెల్లడించాడు. ‘ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు జరుపలేదని, మరో రెండు మూడు రోజుల్లో తమ నిర్ణయాన్ని మీడియా ముందు చెబుతామని’ దిల్రాజు వెల్లడించాడు.